31 Aug,2017

సురేష్ బాబు విడుదల చేసిన "మెంటల్ మదిలో" ట్రైలర్ 

"పెళ్ళిచూపులు" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం "మెంటల్ మదిలో". శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న సాయంత్రం ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. 

ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. "పెళ్ళిచూపులు" తరహాలోనే "మెంటల్ మదిలో" కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు" అన్నారు. 

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "సురేష్ బాబుగారు మా "మెంటల్ మదిలో" ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు. 

 

D Suresh Babu garu launched the trailer of Mental Madhilo and appreciated Raj Kandukuri and Vivek Athreya for the attempt. 

 

He said "I enjoyed the trailer thoroughly and is creating interest around the plot. Hope the magic of Pellichoopulu repeats”.

 

Raj Kandukuri further added that the positivity is all over and we are all confident to entertain you.

 

Official Trailer your way in 30 mins 

Recent News