11 Feb,2017

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల వంగ‌వీటి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ అమితాబ్ బ‌చ్చ‌న్ తో తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌ర్కార్ 3.

ఈ చిత్రంలో మ‌నోజ్ బాజ్ పాయ్, జాకీష్రాఫ్, యామీ గౌత‌మ్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...స‌ర్కార్ 3 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు వ‌ర్మ ముహుర్తం ఫిక్స్ చేసారు.

అది ఎప్పుడో కాదు రామ్ గోపాల్ వ‌ర్మ పుట్టిన‌రోజైన ఏప్రిల్ 7న‌. ఈ విష‌యాన్ని వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...స‌ర్కార్ 3 సినిమాని నా పుట్టిన‌రోజైన ఏప్రిల్ 7న రిలీజ్ చేయ‌నున్నాం అని తెలిపారు.

స‌ర్కార్ సీరిస్ లో రూపొందిన రెండు పార్ట్ లు మంచి విజ‌యాల్ని సాధించాయి. మ‌రి...స‌ర్కార్ 3 కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు స‌క్సెస్ సాధించి సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని ఆశిద్దాం..!

Recent News