బాహుబలితో ఇంటర్నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో దాదాపు పూర్తీ కావొచ్చింది. దాంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. దీనికోసం అన్నపూర్ణా స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ కూడా వేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలో పూర్తీ చేసి త్వరలోనే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.