15 Feb,2017

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ గురు స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత వెంక‌టేష్ నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆత‌ర్వాత జాగర్ల‌మూడి క్రిష్, పూరి జ‌గ‌న్నాథ్ వీరిద్ద‌రితో వెంక‌టేష్ సినిమాలు చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. క్రిష్ వెంక‌టేష్ తో సోషియో ఫాంట‌సీ మూవీ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అంతే కాకుండా విక్ట‌రీ వెంక‌టేష్ 75వ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స్వ‌యంగా క్రిష్ ప్ర‌క‌టించారు కూడా. అయితే...క‌థ విష‌యంలో ప్రాబ్ల‌మ్స్ రావ‌డం వ‌ల‌న వెంకీ - క్రిష్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింద‌ని స‌మాచారం. క్రిష్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వ‌డంతో వెంకీ వెంట‌నే పూరి తో సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభించేది అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

Recent Untold Stories