క్రిష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా

26 Feb,2019

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ .. నటి కంగనా రనౌత్ .. దర్శకుడు క్రిష్ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇంకా ముగిసినట్టు లేదు .. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే క్రిష్ పై పలు కామెంట్స్ చేసిన కంగనా తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.  నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ ప్రథమ భాగం ‘కథానాయకుడు’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ‘మహానాయకుడు’పై మరింత దృష్టి పెట్టి రూపొందించి ఇటీవల విడుదల చేశారు. కానీ ద్వితీయ భాగం కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను ‘మణికర్ణిక’ ప్రాజెక్టును స్వీకరించినపుడు నాపై ఎటాక్ చేసి.. నన్ను హింసించి నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాంబదుల్లా నన్ను పీక్కుతిన్నారు. మరిప్పుడేమంటారు? క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయి. మన స్వాతంత్ర్య సమరయోధులు దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందించినందుకు నాకు చాలా బాధగా ఉంది’ అంటూ  కంగనా ఘాటు విమర్శలు గుప్పించింది.

Recent Gossips