నిర్మాతగా అడుగులు వేస్తున్న క్రేజీ హీరోయిన్

21 Feb,2019

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న కాజల్ అగర్వాల్...ఎన్నో హిట్స్ అందుకుంది. ఆ క్రమంలోనే ఆమె ఎన్నో ఫ్లాప్స్ ను కూడా చవి చూసింది. అయితే సినిమాల ఆఫర్స్ కాస్త తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ కూడా చేసేందుకు రెడీ అయిపోయింది కాజల్.  ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో 'పక్కా-లోకల్'లో ఆదరగొట్టేసింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు నటించినా - అవి కాస్త ఫ్లాప్స్ కావడంతో  కాజల్ పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ. కానీ పట్టు వదలని విక్రమార్కీల తాను ఇండస్ట్రీలో వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని నిర్మాతగా మారి సినిమాలు తీస్తాను అంటుంది. అయితే ముందు తాను మరో అందాల భామ తమన్నాతో కలిసి సినిమాను తియ్యాలి అని ప్లాన్ చేసింది. 'ఆవ్'మూవీ ని హిందిలో రీమేక్ చెయ్యాలి అని అనుకుంది...కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల   అటకెక్కింది. తాజాగా ఆ ఫేమ్  దర్శకుడు ప్రశాంత్ వర్మతోనే మరో సినిమా చేసేందుకు సిద్దం అయ్యింది. అయితే ఈ సినిమాకు కాజల్ నిర్మాతగా మాత్రమే కాదు హీరోయిన్ గా కూడా నటిస్తుందట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో కల్కి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కాజల్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు. మొత్తంగా   హీరోయిన్స్   నిర్మాతలుగా మారడం   చాలా అరుదు   ఒకరిద్దరిని మినహాయిస్తే   ఆ ప్లేస్ లోకి వస్తుంది కాజల్.  

Recent Gossips