అల్లు అర్జున్ తో మరోసారి పూజ జోడి

16 Feb,2019

'నాపేరు సూర్య' తర్వాత  లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.  ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగుతుందని.. అల్లు అర్జున్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేవిధంగా త్రివిక్రమ్  ఇప్పటికే స్క్రిప్ట్ ను పకడ్బందీగా తయారు చేస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి.  కియారా అద్వాని దాదాపు ఫైనల్ అయిందని వార్తలు కొన్ని రోజుల క్రితం వినిపించాయి.  సాయి పల్లవి.. కీర్తి సురేష్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారని కూడా అన్నారు.   కానీ ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఛాన్స్ పూజా హెగ్డేకు దాదాపు గా ఫైనల్ అయినట్టేనని టాక్.   అల్లు అర్జున్ తో పూజా హెగ్డే 'డీజే' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఇద్దరి జోడీ బాగుండడమే కాకుండా సినిమాకు పూజ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  మరోవైపు త్రివిక్రమ్ లాస్ట్ సినిమా 'అరవింద సమేత' లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది.  త్రివిక్రమ్ కు తన సినిమాలలో హీరోయిన్స్ ను పెద్దగా మార్చే అలవాటు లేదు. దీంతో ఈ సినిమాకు పూజను తీసుకుందామని డిసైడ్ అయ్యాడట..బన్నీ కూడా ఈ ప్రపోజల్ కు ఓకే అన్నాడట.  

Recent Gossips